శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:28 IST)

నా స్నేహితుడితో పడుకో... నాకు తాగడానికి డబ్బులు కావాలి... ఆమె ఏం చేసింది?

అతనో ఆటో డ్రైవర్.. ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు..భర్త పెట్టే వేధింపులు భరించలేక నలుగురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోగా మరో ఇద్దరు మృతి చెందారు.. ఏడో భార్యను కూడా నిత్యం మద్యం తాగి వేధిస్తుండగా, అతని బాధలు భరించలేక ఆమె కొట్టి చంపింది. 
 
వివరాల్లోకి వెళితే, మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన 42 ఏళ్ల షేక్ షాబుద్దీన్ దుండిగల్‌కు చెందిన ఖైరున్నీసా బేగంను 2011లో వివాహం చేసుకుని. గాజులరామారం డివిజన్ రావినారాయణరెడ్డి నగర్‌లో కాపురం చేస్తున్నాడు. షాబుద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న షాబుద్దీన్‌కి  అప్పటికే ఆరుగురితో వివాహం జరిగింది. వారిలో నలుగురు భార్యలు వదిలి వెళ్లిపోయారు. 
 
మరో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఖైరున్నీసాను ఏడో భార్యగా చేసుకున్నాడు. ఖైరున్నీసాకు అప్పటికే విహహం కాగా మొదటి భర్తకు కలిగిన సంతానం దుండిగల్‌లోని తల్లి వద్ద ఉంటున్నారు.
 
షాబుద్దీన్ నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తున్నాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఖైరున్నీసా మంగళవారం తెల్లవారు జామున ఇనుపరాడ్డుతో భర్త మెడపై కొట్టడంతో కింద పడ్డాడు. చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. 
 
వెంటనే ఖైరున్నీసా నేరుగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.