ఏపీ ఎమ్మెల్యే.. 'గ్రేటర్లో ఎలా ఓటు వేస్తారు.. బాలకృష్ణకు పదవీగండం తప్పదా?
సినీ హీరో, హిందూపురం ప్రజాప్రతినిధి, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణకు పదవీగండం పొంచివున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి గ్రేటర్ ఎన్నికల్లో ఓటువేశారని పొన్నం ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని.. ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే రెండు రోజుల పాటు సైలెంట్గా ఉన్న పొన్నం ఇవాళ ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పడం మరింత ఆసక్తికరగా మారింది.