గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (10:53 IST)

బాలయ్య చేయి మళ్లీ రఫ్ ఆడింది... నలుగురిపై చేయి చేసుకున్న సింహా

సింహాకు కోపమొస్తే అంతే... ఎంతమంది వున్నా... ఎన్ని కెమేరాలు తీస్తున్నా కోపమొస్తే అంతే... చేయి రఫ్ ఆడేస్తుంది. ఇదే జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో అసహనంతో పలుమార్లు అభిమానులుపై చేయి చేసుకున్నారు బాలయ్య.

సింహాకు కోపమొస్తే అంతే... ఎంతమంది వున్నా... ఎన్ని కెమేరాలు తీస్తున్నా కోపమొస్తే అంతే... చేయి రఫ్ ఆడేస్తుంది. ఇదే జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో అసహనంతో పలుమార్లు అభిమానులుపై చేయి చేసుకున్నారు బాలయ్య. హీరో బాలకృష్ణ మరోసారి నలుగురు అభిమానులపై చేయి చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ, మదిర నుంచి సత్తుపల్లి సభకు వెళ్లేందుకు వాహనాలతో ర్యాలీగా బయల్దేరారు. 
 
ఈ అభిమానులంతా ఆయనతో కరచాలనం, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంలో నూతనకల్‌కు చెందిన నలుగురు అభిమానులు వాహనానికి అడ్డంగా నిల్చుని జై బాలయ్యా.... జై జై బాలయ్యా అంటూ అరుస్తూ బాలకృష్ణతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. 
 
వారి అరుపులకు, వాహనానికి అడ్డుగా నిలబడటం చూసి కోపం వచ్చేసిన బాలయ్య తీవ్ర అసహనానికి గురై వాహనం దిగి... ఆ నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన బాలకృష్ణ అభిమానులులు కోపోద్రిక్తులైన మిట్టపల్లి సెంటర్లో ఫ్లెక్సీలను చించి వాటిని దహనం చేశారు.