శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (11:18 IST)

శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మామూలోడు కాదు.. రాసలీలల బాగోతం..?

బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు

బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో రోజుకో కథ వెలుగులోకి వస్తుంది.

శిరీషతో అక్రమసంబంధం ఉన్న వల్లభనేని రాజీవ్‌కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. ఫోన్ నుంచి రాజీవ్ దాచి ఉంచుకున్న రాసలీలల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్జే స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో కూడా అనేక ఫోటోలు, వీడియోలను గుర్తించారు. దీంతో రాజీవ్ పెద్దమోసగాడని పోలీసులు చెప్తున్నారు. 
 
శిరీషతో పాటు మరో నలుగురు యువతులతో రాజీవ్ సన్నిహితంగా మెలగినట్టు తెలుస్తోంది. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్... వారికి తెలియకుండా తాను తీసిన అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వారిని దూరం పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. 
 
తొలుత శిరీషను, తరువాత తేజస్వినిని వదిలించుకుందామని భావించిన రాజీవ్... నెల క్రితమే మరో యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడని పోలీసులు చెప్తున్నారు.