మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2017 (12:34 IST)

రోజాపై బోండా 'గుండు' సవాల్ కలిసొచ్చిందా? కాకినాడలో కూడా...

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుం

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుందని చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెకు అప్పట్లో ఓ సవాల్ కూడా విసిరారు.
 
నంద్యాలలో తెదేపా ఓడితే తను గుండు చేయించుకునేందుకు సిద్ధంగా వున్నాననీ, అదే వైసీపి ఓడిపోతే రోజా కూడా గుండు చేయించుకునేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ పైన రోజా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ బోండా ఉమ సవాల్ మాత్రం బాగా పబ్లిసిటీ అయ్యింది. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బహిరంగంగా ఉరి తీసినా తప్పులేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దెబ్బకొట్టాయని అంటున్నారు. 
 
మొత్తమ్మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళిలో చేసిన తప్పిదాల వల్ల చాలా వరకూ నెగటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అక్కడ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలపై మరోసారి బోండా ఉమ తన 'గుండు' సవాల్ మరోసారి విసురుతారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో?