హైదరాబాద్లో మర్డర్స్ కల్చర్: రౌడీ షీటర్ అనుకుని కెమెరామెన్ను?
హైదరాబాదులో మర్డర్స్ కల్చర్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రత్యర్ధులను మట్టుబెట్టేందుకు కత్తులు, కటార్లతో బయల్దేరుతున్నారు. రౌడీ షీటర్ అనుకుని సినీ అసిస్టెంట్ కెమెరా మెన్ను కత్తులతో నరికిన భయానక సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
జూబ్లిహిల్స్ చెక్ పోస్టుకు దగ్గర్లో ఉండే కృష్ణానగర్లోని 'బి'బ్లాక్లో సినీ అసిస్టెంట్ కెమెరా మెన్ గోపి తన స్నేహితులతో మాట్లాడుతుండగా, రెహమత్ నగర్కు చెందిన చోర్ చేత, చోర్ అబ్బు, శీను తమ అనుచరులు 30 మందితో వచ్చి తల్వార్లతో దాడి చేసి పరారయ్యారు.
గోపి తీవ్రంగా గాయపడడంతో అతని స్నేహితులు అపోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో స్థానిక రౌడీ షీటర్ అర్జున్ యాదవ్ను హత్య చేసేందుకు వచ్చిన దుండగులు, గోపీని అర్జున్ యాదవ్గా భ్రమపడి కత్తులతో దాడి చేశారని తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.