శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌ ఫారమ్‌లో సోమవారం ఉదయం ఓ చిరుత అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ స్తంభం వద్దకు వచ్చింది. ఆ తర్వాత దీనికి ఏం కనిపించిందో ఏమోగానీ, చకచకా కరెంట్ స్తంభమెక్కింది. 
 
ఆసమయంలో విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంటు షాక్‌ కొట్టి అక్కడే చనిపోయింది. అడవిలోకి వెళ్లిన స్థానికులు ఆ చిరుతను గమనించి సర్పంచ్‌కు, అటవీ అధికారులకు సమాచారమిచ్చి చిరుత కళేబరాన్ని కిందకు దించారు.