శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:06 IST)

పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ: చంద్రబాబుపై చెవిరెడ్డి ధ్వజం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విపక్ష వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని చెవిరెడ్డి అభివర్ణించారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని కూడా చెవిరెడ్డి ఆరోపించారు. 
 
సొంత రాష్ట్రంలో తప్పించుకుని పక్క రాష్ట్రంలో చంద్రబాబు పట్టుబడిపోయారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. తద్వారా ఏపీ పరువును పొరుగు రాష్ట్రంలో నిలువునా ముంచారని, భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు.

శుక్రవారం అసెంబ్లీ తొలుత వాయిదా పడ్డ తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా చెవిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై దమ్ముంటే చర్చకు రావాలని కూడా ఆయన అధికార పక్షానికి సవాల్ విసిరారు.