మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (11:53 IST)

కేంద్ర బృందంతో నేడు భేటీ కానున్న సీఎం జగన్, వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా

ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజులపాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈ రోజు ఉదయం 11 గంటల30 నిమిషాలకు సీఎంను కలవనున్నారు. వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎస్ 6వేల 386 కోట్లు నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
 
తాత్కాలిక సహాయక చర్యల కోసం 840 కోట్లు అవసరం కాగా శాస్వత పునరుద్దరణ చర్యకు 4 వేల 439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా 903 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.
 
అలాగే 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని దీనికోసం 483 కోట్లు నష్టం ఏర్పడిందని తెలిపారు. తక్షణ సాయం, తడి ధాన్యం కొనుగోలుపై సడలింపు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు. అయితే వరద కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ఆదుకోవాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాసిన సంగతి తెలిసిందే.