శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:59 IST)

259వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 259వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు చేపట్టారు.

తుళ్లూరులో రైతులు, మహిళలు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతవరంలో అసైన్డ్‌ రైతులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

144 సెక్షన్‌తో నిర్బంధం ఉంచినా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పెనుమాక, ఉండవల్లిలో దీక్షలు నిర్వహించారు.