1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 28 జులై 2016 (18:56 IST)

ఏపీకి కాంగ్రెస్, బీజేపీ అన్యాయం... అందుకే లేదు అవ‌త‌ర‌ణ దినోత్స‌వం... సీఎం చంద్రబాబు

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడానికి బీజేపీ కూడా కారణమని గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని అన్నారు. అందువ‌ల్ల‌ ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఏపీకి ప

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడానికి బీజేపీ కూడా కారణమని గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని అన్నారు. అందువ‌ల్ల‌ ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు చేయూతనివ్వాలన్నారు. 
 
విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, మరోసారి అలా చేయొద్దని చంద్ర‌బాబు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకే ఏపీ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.