శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (12:16 IST)

నిధుల తగాదా.. చిలికి చిలికి గాలివానలా...గవర్నర్‌కు పంచాయితీ!

కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. 
 
ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్‌కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్‌లు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులను ఏకపక్షంగా బదలాయించరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్యాంకర్లను ఆదేశించారు. 
 
నిధుల బదలాయింపుకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన సంక్షేమ కార్మికుల బోర్డు నుండి 610 కోట్ల రూపాయల నిధులు విజయవాడ బ్యాంకులకు బదలాయింపు, దీనిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడంపై శుక్రవారం పెద్ద దుమారం చెలరేగింది.