గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:51 IST)

హైదరాబాద్ ఓయో హోటల్‌లో ఢిల్లీ యువతి గ్యాంగ్ రేప్... సర్వీస్ బాయ్స్ దారుణం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది. ఈ హోటల్‌లో ఢిల్లీకి చెందిన 20 యేళ్ల హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన దిగింది. ఆమె ఆన్‌లైన్‌లో ఈ హోటల్ గదిని బుక్ చేసుకుంది. ఆ యువతి ఒంటరిగా ఉండటం గమనించిన హోటల్ రూం సర్వీస్ బాయ్స్ ఆమెపై కన్నేశారు. 
 
అయితే, ఆ యువతి నగరాన్ని చుట్టి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒంటరిగా హోటల్‌కు చేరుకుంది. ఆమె హోటల్ లిఫ్టు ఎక్కుతుండగా చుట్టుముట్టి వేధించారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి.. తన గదికి చేరుకుంది. ఆ తర్వాత వేకువజామున 4 గంటల సమయంలో రూం కాలింగ్ బెల్ కొట్టడంతో లేచిన ఆమె 'ఎవరు?' అని ప్రశ్నించడంతో 'రూం బాయ్' అని సమాధానం విని తలుపులు తీసింది. దీంతో వెటనే ఆమె రూంలోకి దూరిన నలుగురు హోటల్ సిబ్బంది తుపాకీ చూపించి బెదిరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. 
 
దీనిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్‌లో రూం బాయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ హోటల్ సిబ్బంది అని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులంతా నెల్లూరు వాసులుగా తెలుస్తోంది.