శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (10:20 IST)

నాన్నమ్మ పక్కలో నిద్రపోతున్న కుమార్తెను ఎత్తుకెళ్లి రేప్ చేసిన కన్నతండ్రి.. ఎక్కడ

సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ మారుమూల పల్లెలో అభంశుభం తెలియని మైనర్ బాలికపై కన్నతండ్రే లైంగికదాడికి పాల్పడ్డాడు. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ కామాంధుడే.. ఆ బాలిక శీలాన్ని చిదిమేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ లైంగికదాడి ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ శివారు గ్రామంలో తొమ్మిదో తరగతి చదివే ఓ బాలిక ఉంది. కొన్నేళ్ళ క్రితం ఆమె తల్లి చనిపోయింది. దీంతో హాస్టల్‌లో ఉంటూ, చదువుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఇంట్లో తండ్రి, నాయనమ్మ ఉన్నారు. కూతురిపై ఎప్పటి నుంచో కన్నేసిన తండ్రి ఆదివారం రాత్రి నాయనమ్మ పక్కన పడుకున్న బాలికను ఎత్తుకు వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
అలాగే, సోమవారం రాత్రి కూడా మరోమారు ఇదే విధంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో బాలిక పక్కింటికి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి అక్కడికి వెళ్లి కుమార్తెను పంపమని పక్కింటివారితో గొడవకు దిగడంతో బాలిక వద్ద ఆరా తీయగా అసలు విషయం వెల్లడించింది. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఆ కామాంధుడుకి దేహశుద్ధి చేసి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో రాయవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.