మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (18:05 IST)

సీఎం జ‌గ‌న్‌ సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి: నారా లోకేష్

అమరావతి భూముల వ్యవహారంపై ఫేక్ ఫిర్యాదు చేశారంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఇలా రాశారు.. నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి, సీఎం జ‌గ‌న్‌ సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి. అస‌త్య‌ ప్ర‌చారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న‌ అధికారం అండ‌తో అమ‌రావ‌తిపై ప‌న్నిన మ‌రో కుట్ర‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. సీఎం ఆదేశాల‌తో, ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో, సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాం.
 
ఇప్ప‌టికైనా ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపైనా, టిడిపిపైనా కుతంత్రాలు ఆపండి. అంద‌రి ఆమోదంతో, రైతుల త్యాగాల పునాదుల‌పై నిలిచిన ప్ర‌జారాజ‌ధానిపై విద్వేషంతో అమ‌రావ‌తి విధ్వంసానికి ప్ర‌య‌త్నించిన‌ ప్ర‌తీసారీ న్యాయ‌మే గెలుస్తుంది. నీ అస‌త్య‌పు కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతూనే వుంటాయి.