శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (13:30 IST)

అమ్మ ఆరోగ్యం బాగాలేదని వెళతూ కారు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భవ్య పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను వేగంగా వస్తున్న మారుతి ఆల్టో(AP 09A Z7703 ) వెనక నుండి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమారులు పరంజ్యోతి, థిప్పెన్ మృతి చెందగా.. కోడలు చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆమెను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న థిప్పెన్... ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే తెనాలిలో ఉంటున్న తన తల్లి పరంజ్యోతికి అనారోగ్యం కారణంగా హైదరాబాదు నుండి తెనాలికి కుటుంబంతో కలిసి కారులో బయలుదేరాడు థిప్పేన్.
 
పొగ మంచు కారణంగా రహదారి సక్రమంగా కనిపించక పోవటంతో దాచేపల్లి భవ్య పెట్రోల్ బంక్ వద్ద ముందు వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పిడుగురాళ్ల ఆసుపత్రి తరలించారు. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.