కడప జిల్లాలో దారుణం: 5 రోజుల పసికందును చంపేసిన తండ్రి!
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల పసికందును ఓ కసాయి తండ్రి పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్నా.. తనకు ఆడశిశువు పుట్టిందనే వార్త వినగానే ఆ దుర్మార్గపు తండ్రి.. పసికందును ప్రాణం తీసేశాడు.
పుట్టి ఐదు రోజులే అయ్యాయి. బిడ్డతల్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిందో లేదో.. బిడ్డను తండ్రి దిలీప్ వాటర్టాంక్లో పడేసి చంపేశాడు. కాగా రేఖ, దిలీప్ దంపతులు ప్రొద్దుటూరు సిటీ, శ్రీనివాస్ నగర్లో నివాసముంటున్నారు.
గత ఏడాది ప్రేమవివాహం చేసుకున్న వీరిద్దరికి ఆడశిశువే తొలి సంతానంగా జన్మించింది. కానీ పుట్టిన ఐదు రోజుల్లోనే ఆ శిశువు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.