శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (14:28 IST)

మహిళలకు కథలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం... కర్చీఫ్‌తో గొంతు బిగించి హత్య... తూగోలో కిరాతక చర్య

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కిరాతకుడు చేసిన చేసిన దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ కిరాతకుడు నోరు తెరచి కథ మొదలు పెట్టాడంటే ఎవరైనా లీనమై పోవాల్సిందే. మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని తన గానంతో వశప

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కిరాతకుడు చేసిన చేసిన దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ కిరాతకుడు నోరు తెరచి కథ మొదలు పెట్టాడంటే ఎవరైనా లీనమై పోవాల్సిందే. మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని తన గానంతో వశపరచుకుని, శారీరకంగా అనుభవించి, అంతటితో వదలకుండా హత్య చేసి, వారి ఒంటిపై ఉండే నగలను దోచుకోవడం ఇతని అలవాటు. ఒకటి, రెండు కాదు. ఏకంగా ఐదుగురు యువతులపై అత్యాచారం చేసి హత్యలు చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన వివాహిత చేవూరి భాగ్యవతి అదృశ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఈ కేసుపై ఆరా తీశాయి. దీనిపై అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య వెల్లడిస్తూ అమాయక మహిళలకు కథలు చెప్పి వారిని లోబరచుకుంటాడని తెలిపారు. భాగ్యవతితో పరిచయం పెంచుకుని, ఆమెను 8వ తేదీన ఇసుక దిబ్బల్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి, ఆపై కర్చీఫ్‌తో గొంతు బిగించి చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించాడని వెల్లడించారు.
 
తమ విచారణలో భాగంగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని మద్దురిలంకకు చెందిన ఆకుల నాగమణి (40), యానాంకు చెందిన సత్యవతి, దంగేరుకు చెందిన ఓ వివాహితతో పాటు మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతిలను ఇదే పద్ధతిలో నిందితుడు కడ తేర్చాడని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు.