1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (13:21 IST)

వీడూ మనిషేనా : ఇద్దరు బామ్మలను నరికి చంపేశాడు...

తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి ఇద్దరు బామ్మలను నరికి చంపేశాడు. కేవలం విసిగిస్తుందన్న కారణంతో క్షణికావేశంలో బామ్మతో పాటు అడ్డొచ్చిన నానమ్మను కూడా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూడూరు మండలం చన్‌గోముల్ గ్రామానికి చెందిన శివకుమార్ మంగళవారం ఈనెల 11వ తేదీన తెల్లవారుజామున తన సొంత నానమ్మ బుచ్చమ్మను కొడవలితో నరికి చంపాడు. ఆ తర్వాత చిన్న తాతయ్య భార్య అంతమ్మపై అదే కొడవలితో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అంతమ్మను వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.