శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (06:04 IST)

అప్పుడు ఉద్యోగులను వదలమన్నారు... ఇప్పుడు నేతలనే వదల బొమ్మాళీ అంటున్నారు

ప్రభుత్వం చెప్పినట్లల్లా డ్యాన్స్ చేస్తే అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారుల భరతం పడతామని ఇటీవలే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రేంజిలో ఏపీ అధికారులను బెదరగొట్టేశారు. ఇప్పుడు విశాఖ మహాధర్నా సందర్భంగా టీడీపీలోని భూకబ్జాదారులనే వదలబోమంటూ వైకాపా

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాటేమిటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇప్పటినుంచే వదల బొమ్మాళీ అనే మంత్రాన్ని మాత్రం అతిగానే ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లల్లా డ్యాన్స్ చేస్తే అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారుల భరతం పడతామని ఇటీవలే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రేంజిలో ఏపీ అధికారులను బెదరగొట్టేశారు. ఇప్పుడు విశాఖ మహాధర్నా సందర్భంగా టీడీపీలోని భూకబ్జాదారులనే వదలబోమంటూ వైకాపా నేతలు స్వరం పెంచుతున్నారు.  
 
అధికార అండతో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా భూములు కబ్జా చేశారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ‘సేవ్‌ విశాఖ’ పేరుతో గురువారం చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక భూకబ్జాదారులెవరినీ వదిలిపెట్టబోమని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
 
పేదలను భూములను టీడీపీ నేతలు కొల్లగొట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ ఆరోపించారు. పక్కా వ్యూహంతో ప్రకారం భూములు కబ్జా చేసి తమ బినామీలకు కట్టబెట్టారని అన్నారు. చోడవరం నియోజకవర్గంలోనూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు.
 
అధికార టీడీపీ నాయకులు లక్ష ఎకరాల భూములు చట్టవిరుద్ధంగా ఆక్రమించారని వైఎస్సార్ సీపీ నేత మల్లా విజయప్రసాద్‌ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని హామీయిచ్చారు.