శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (09:08 IST)

పరాయి పురుషునికి పడక సుఖం ఇస్తుందని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త.. కట్టుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని వట్టిచెరుకూరు నెహ్రూన

మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త.. కట్టుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని వట్టిచెరుకూరు నెహ్రూనగర్‌ ఎస్సీ కాలనీకి చెందిన కాకుమాను సుధాకర్‌ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం పేరేచర్లకు చెందిన అరుణ‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అరుణ(30)కు ఇతరులతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సుధాకర్‌ కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. దీంతో ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ వచ్చాడు. భర్త పెట్టే బాధలను తట్టుకోలేక ఆమె రెండు వారాల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషుల ద్వారా వారం రోజుల క్రితం అరుణను సుధాకర్‌ వట్టిచెరుకూరు తీసుకొచ్చాడు.
 
ఈ నేపథ్యంలో సుధాకర్‌ సోమవారం ఉదయం పొలంలో వరిగడ్డి కడెంను మోపులు కట్టాలని చెప్పి భార్య అరుణను తీసుకెళ్లాడు. నెహ్రూనగర్‌ ఎస్సీ కాలనీ సమీపంలోని నాగన్నకుంట వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. సుధాకర్‌ పథకం ప్రకారం అంతకుముందే పొలంలో ఐదు లీటర్ల పెట్రోలు క్యాను, మారణాయుధాలు ఉంచాడు. 
 
ఘర్షణ తీవ్రం కావడంతో సుధాకర్‌ మారణాయుధాలతో ఆమెను దారుణంగా హతమార్చి పెట్రోలు పోసి తగులబెట్టి పరారయ్యాడు. పొలంలో మంటలు రావడంతో స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. తాము వెళ్లేసరికే అరుణ మృతి చెందినట్లు వారు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.