శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (09:04 IST)

వాడు బతికేందుకు అర్హుడు కాదు.. ఉరికంటే పెద్ద శిక్షవుంటే..

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని అతని తల్లిదండ్రులు, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. ఉరికంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే ఆ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడు అంత దుర్మార్గుడని తమకు తెలియదని, అతడికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే అవుతుందన్నారు. అందువల్ల అతడ్ని చంపేయాలని చెప్పారు. 
 
అతడి వల్ల తాము తలెత్తుకోలేకపోతున్నామని, ఉన్న ఊరును వదిలి ప్రాణభయంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నామన్నారు. తమ కుమారుడు చేసిన వరుస హత్యలపై తండ్రి బాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడతాడని తాము అనుకోలేదన్నారు. పైగా, అతడి ప్రవర్తనపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదన్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పలు ప్రాంతాలు తిరిగేవాడని, గతేడాది గృహప్రవేశం సందర్భంగా ఇంటికి వచ్చాడని వివరించాడు.
 
కుమారుడి కారణంగా తమ బతుకులు ఆగమయ్యాయని అతడి తల్లి కన్నీరు పెట్టుకుంది. వాడిని చంపితేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, అమ్మాయిల ఆత్మకు శాంతి చేకూరుతుందని విజ్ఞప్తి చేసింది. వేములవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పాడని, ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడించాడని వివరించింది. ఇన్ని ఘాతుకాలకు పాల్పడుతున్నా కుమారుడిపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదని చెప్పింది.