శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 మే 2018 (19:01 IST)

నిన్ను హిజ్రాగా మార్చేందుకు లక్షలు పెట్టాం.. నువ్వలా వెళ్లిపోతే చంపేస్తాం చిట్టీ... ఒంగోలు హిజ్రాస్

హిజ్రాలంటే చాలామంది భయపడిపోతుంటారు. రైళ్లలో బస్సు స్టేషన్లలో హిజ్రాలు నానా హంగామా చేస్తుండటం చాలామంది చూసే వుంటారు. ఐతే ఇప్పుడు ఒంగోలు లోని హిజ్రాలతో తనకు ప్రాణ భయం వున్నదంటూ హిజ్రాగా మారిన సంధ్య వణికిపోతోంది. అసలేం జరిగిందంటే... ఒంగోలులోని హనుమంతుని

హిజ్రాలంటే చాలామంది భయపడిపోతుంటారు. రైళ్లలో బస్సు స్టేషన్లలో హిజ్రాలు నానా హంగామా చేస్తుండటం చాలామంది చూసే వుంటారు. ఐతే ఇప్పుడు ఒంగోలు లోని హిజ్రాలతో తనకు ప్రాణ భయం వున్నదంటూ హిజ్రాగా మారిన సంధ్య వణికిపోతోంది. అసలేం జరిగిందంటే... ఒంగోలులోని హనుమంతునిపాడు మండలం వేములపాడుకు చెందిన బి.చిట్టిబాబు నాలుగేళ్ల క్రితం చదువుకునేందుకు వచ్చాడు. 
 
అక్కడ అతడికి దుర్గారావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ క్రమంలో చిట్టిని దుర్గారావు ముంబైకి తీసుకెళ్లి అతడి శరీరావయాలను మార్చేసి హిజ్రాగా చేసేశాడు. ఆ తర్వాత తిరిగి ఒంగోలుకు తీసుకువచ్చి తోటి హిజ్రాలతో కలిపేశాడు. ఆ తర్వాత చిట్టిబాబు తన పేరును సంధ్యగా మార్చుకుని హిజ్రాలతో కలిసి వినోదాన్ని పంచుతూ డబ్బు సంపాదిస్తూ వచ్చింది. ఐతే ఇటీవల తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తెలుసుకుని సొంతూరుకు వెళ్లింది. తల్లిదండ్రుల వద్దే వుంటూ వారి బాగోగులను చూసుకోవాలనుకుంది. 
 
కానీ తోటి హిజ్రాలతో పాటు అతడిని ఆమెలా మార్చేసిన వాళ్లంతా వచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. లక్షలు పెట్టి హిజ్రా మార్చేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదనీ, మాట విని వెనక్కి వస్తే సరి... లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయింది. తనకు రక్షణకు కల్పించాలంటూ జిల్లా అధికారులకు మొరపెట్టుకుంటోంది. మరి ఆమె విన్నపాన్ని అధికారులు పట్టించుకుంటారో లేదో?