శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:00 IST)

గుంటూరులో వ్యభిచారం.. అండర్‌గ్రౌండ్‌లో దాగిన యువతుల అరెస్టు!

జిల్లా కేంద్రమైన గుంటూరులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇటీవలే జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లోని వ్యభిచార గృహాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. తాజాగా నగరంలోని రామిరెడ్డివారి తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్లో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వ్యభిచార ముఠా గుట్టు రట్టుపై డీఎస్పీ గంగాధరమ్ మాట్లాడుతూ పలు ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంట్లో పోలీసులు గత రాత్రి తనిఖీలు చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో యువతులెవరూ కనిపించకపోవటంతో అక్కడి పరిసరాల్ని పరిశీలించారు. పోలీసులకు సందేహం వచ్చి గదిలోని గ్యాస్ స్టౌవ్ బండ వద్ద  ఏర్పాటు చేసిన ఓ బండను తొలగించగా భూగర్భంలో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన నలుగురు యువతలు కనిపించారు.
 
వారిని విచారించగా అన్నపురెడ్డి సుమంత్ అనే వ్యక్తి... ఈ యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. గతంలోనూ సుమంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, రిమాండ్ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత అతడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమంత్ పరారీలో ఉండగా, యువతులను ఆధార్ హోమ్కు తరలించారు. సుమంత్‌పై కేసు నమోదు చేసి.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.