శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 4 జూన్ 2019 (14:30 IST)

ఇనుప చైన్‌తో తండ్రిపై కొడుకు దాడి... మామ కళ్లల్లో కోడలు గొడ్డుకారం...

సభ్య సమాజం తల దించుకొవాల్సిన ఘటన. కని ‌పెంచిన‌ తండ్రిని నడి బజారులో సైకిల్ చైన్‌తో దాడి చేసాడో తనయుడు. తండ్రిని కొడుకు చితకబాదుతుంటే అయన కోడలు కారం పోడితో మామగారు మీద దాడి చేసింది. దీంతో పాటు యాసిడ్ పోసి హతమార్చాలని ప్రయత్నించారు కొడుకు కోడలు. ఈ దారుణం చూసిన చుట్టుపక్కల వారు సమయానికి స్పందించి ఆ తండ్రిని కాపాడారు.
 
వివరాలు పరిశీలిస్తే... తిరుపతి అనంత వీధిలో నివాసం ఉంటున్నాడు మునిక్రిష్ణయ్య. అతనికి ఇద్దరు కూమారులు. మునిక్రిష్ణయ్య మేస్త్రీ పని చేసి అనంత వీధిలో ఇల్లు‌ కట్టుకున్నాడు. వివాహం అయిన తర్వాత పెద్ద కూమారుడు విజయ్ భాస్కర్ ఇల్లు విడిచిపోయాడు. అప్పులున్నాయని
 ఇల్లు వదిలి‌పోయాడు చిన్న కూమారుడు. అప్పులు తీర్చిన తర్వాత పెద్ద కూమారుడు దౌర్జన్యంగా ఇల్లు‌ ఆక్రమించుకున్నాడు.
 
దీంతో చిన్నకూమారుడు ఇంటి నుంచి వెళ్ళి పోయాడు. తండ్రి ఓ పోర్షన్‌లో ఉన్నాడు. మిగతా ఇల్లు మొత్తం పెద్ద కూమారుడు కంట్రోల్లో ఉంది. దీంతో ఓ ఫేక్ డాక్యుమెంట్‌తో ఇల్లు అమ్మినట్లు కేసు వేసాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున విజయ్ భాస్కర్, అతని భార్య కలసి  ఇంట్లో ఉన్న మునిక్రిష్ణయ్యను బయటకు లాగి సైకిల్ చైన్‌తో పాటు రాడ్‌తో దాడి చేసారు. విజయ్ భాస్కర్ భార్య కారం పొడి చల్లింది. దీంతో అడ్డు వచ్చినవారు ఇబ్బది పడ్డారు. చివరకు సమీప‌ బంధువులు విడిపించి అసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.