ఆస్తి కోసం సొంత తమ్ముడు, మరదలిని రెండో అంతస్తు నుంచి తోసేసిన అక్క
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తమ్ముడు, మరదిలిని రెండో అంతస్తు నుంచి అక్క తోసేసింది. ఈ ఘటనలో మరదలు ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంద
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తమ్ముడు, మరదిలిని రెండో అంతస్తు నుంచి అక్క తోసేసింది. ఈ ఘటనలో మరదలు ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఐడీహెచ్ కాలనీలో చందు, అతని భార్య జయశ్రీలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉమ్మడి ఆస్తి కావడంతో... దాని కోసం అతనికి, అతని అక్క మీరాబాయికి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈనేపథ్యంలో, సోమవారం రాత్రి మీరాబాయి తన కుమారుడు చింటు, కుమార్తె కీర్తి, అల్లుడు బబ్లూలతో కలసి చందు ఇంటికి వచ్చింది. వీరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశం పట్టలేక చందు, జయశ్రీలను వీరంతా కలసి రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు.
పైనుంచి ఏదో పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, తీవ్రంగా గాయపడిన చందు, జయశ్రీలు కనిపించారు. స్థానికులు వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ జయశ్రీ మృతి చెందింది. చందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.