శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 జులై 2018 (15:28 IST)

విద్యార్థితో టీచర్ వికృత చర్యలు.. క్యాబిన్‌కు పిలిచి అభ్యంతరకంగా ప్రవర్తించాడు..

సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాం

సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. హైస్కూలు ఉపాధ్యాయుడు విద్యార్థులతో వికృతంగా ప్రవర్తించిన సంఘటన హైదరాబాద్‌ రాంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాంనగర్‌ హైస్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజు గత మూడు రోజులుగా ఏడవ తరగతి విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సదరు విద్యార్థి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి కుమారుడిని బలవంతంగా పాఠశాలకు తీసుకురాగా ఏడుపు మొదలుపెట్టాడు. ఏమైందని గట్టిగా నిలదీయగా అడ్మినిస్ట్రేటర్‌ రాజు గత మూడు రోజులుగా తన క్యాబిన్‌కు తనను పిలిపించుకుని అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు నిజం చెప్పేశాడు. 
 
దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు టీచర్‌పై దాడి చేశారు. రాజు పారిపోగా, తొమ్మిదో తరగతికి విద్యార్థిపై కూడా అతను ఇదే విధంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు.