శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (10:10 IST)

ప్రేమను తిరస్కరించిందనీ ప్రియురాలు.. ఆమె తల్లిపై దాడి... ఆపై సూసైడ్

తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతితో పాటు.. ఆమె తల్లిపై కూడా ఓ ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి (31) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని స్రవంతి నగర్‌లోని ఓ ఇంటిలో అద్దెకు నివశిస్తున్నాడు. అదే ప్రాంతంలో తన తల్లి సుజాతతో కలిసి తమిళనాడుకు చెందిన సౌజన్య (26) నివాసముంటోంది. శ్రీనివాస రెడ్డి, సౌజన్య ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో సౌజన్యపై శ్రీనివాస రెడ్డి మనసుపడింది. దీంతో గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
ఈ విషయాన్ని సౌజన్య దృష్టికి తీసుకెళ్లగా ఆమె.. శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనను తిరస్కరించింది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన శ్రీనివాస రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ, ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకుని సౌజన్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సౌజన్య ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లికి విషయం చెప్పి తన ప్రేమకు అడ్డురావొద్దని హెచ్చరించాడు. 
 
అయితే, అందుకు ఆమె అభ్యంతరం చెప్పి, తన కూతురును ప్రశాంతంగా బతకనివ్వాలని సుజాత వేడుకుంది. దీంతో తమ ప్రేమకు ఆమె అడ్డు వస్తోందని భావించిన శ్రీనివాస రెడ్డి స్క్రూ డ్రైవర్‌తో ఆమెపై దాడి చేశాడు. అదేసమయంలో ఇంటికి వచ్చిన సౌజన్య... తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస రెడ్డి ఆమెను కూడా గాయపరిచాడు.
 
తల్లీకూతుళ్ల అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సౌజన్య, ఆమె తల్లిని స్థానికులు  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దాడి చేసిన వెంటనే శ్రీనివాసరెడ్డి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.