1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (15:38 IST)

ఐస్‌క్రీమ్‌లో మత్తుకలిపి... 17 యేళ్ళ బాలికపై సవతి తల్లి అన్న అత్యాచారం

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 17 యేళ్ళ యువతిపై కన్నేసిన ఓ కామాంధుడు ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో 17 యేళ్ళ బాలిక నివశిస్తోంది. ఈమెకు చిన్నవయసుల్లోనే తల్లి కోల్పోయింది. దీంతో ఆ యువతి తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఆ యువతి సవతి తల్లి సంరక్షణలో పెరుగుతూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై సవతి తల్లి అన్న కన్నేశాడు. బాలికకు ఐస‌క్రీమ్‌లో పలుమార్లు మత్తుమందు కలిసి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆ బాలిక బంధువులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బాధిత యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.