గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (18:12 IST)

పిలిస్తే పలుకలేదని ఫ్రెండ్‌ను చంపేశారు.. ఎక్కడ?

ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పిలిచారు. బైక్ శబ్దానికి వాహనంపై వెళుతున్న వ్యక్తికి వినిపించలేదు. దీంతో ఆగ్రహించిన ఆ కిరాతకులు.. తిరుగు ప్రయాణంలో బైక్‌ను ఆపి సదరు వ్యక్తిని కత్తి

ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పిలిచారు. బైక్ శబ్దానికి వాహనంపై వెళుతున్న వ్యక్తికి వినిపించలేదు. దీంతో ఆగ్రహించిన ఆ కిరాతకులు.. తిరుగు ప్రయాణంలో బైక్‌ను ఆపి సదరు వ్యక్తిని కత్తితో పీకకోసి చంపేశారు. ఈ దారుణం హైదరాబాద్‌లోని మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిర్రా కిషన్‌నగర్‌కు చెందిన జాఫర్ అనే వ్యక్తి కుమారుడు మహమ్మద్ ఇసా (22) పండ్ల వ్యాపారి... శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇసాను అతడి స్నేహితుడు మాజిద్ పని ఉందని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న ఇసాను చూసిన అతడి స్నేహితులు మహమూద్, ముస్తాపాలు పిలిచారు. అది వినబడకపోవడంతో ఇసా పట్టించుకోలేదు.
 
రాత్రి 11:30 గంటలకు ఇసా తిరిగి వచ్చేవరకు అక్కడే కాపు కాసిన స్నేహితులు మరోమారు పిలిచారు. దీంతో స్నేహితుల దగ్గరకు వెళ్లిన ఇసాతో గొడవకు దిగారు. పిలిచినా పట్టించుకోకుండా ఎందుకు వెళ్లిపోయావంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇసా, మహమూద్‌ మధ్య మాటామాటా పెరిగి... ఒక్కసారిగా కత్తితో ఇసాపై దాడిచేశాడు. చాతిపై కత్తిపోట్లు తగలడంతో ఇసా కుప్పకూలిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఇసాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇసా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పిలిస్తే పలకలేదన్న కోపంతో క్షణికావేశంతో స్నేహితుడి ప్రాణాలు తీసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.