బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:08 IST)

పెళ్ళిపీటలపై వరుడు... మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడంటూ...

పెళ్లి పీటలపై వరుడు కూర్చొనివున్నాడు. మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి వుంది. కానీ, అపుడే ఓ యువతి పెళ్లిమండపంలోకి పోలీసులతో ప్రత్యక్షమైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడంటూ

పెళ్లి పీటలపై వరుడు కూర్చొనివున్నాడు. మరికొన్ని నిమిషాల్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి వుంది. కానీ, అపుడే ఓ యువతి పెళ్లిమండపంలోకి పోలీసులతో ప్రత్యక్షమైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసింది. అంతేనా వరుడుపై లైంగికదాడి కేసు కూడా పెట్టింది. దీంతో అప్పటివరకు కళకళలాడిన పెళ్ళి మండపం ఒక్కసారిగా బోసిబోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి హెరిటేజ్ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ, ఇందిరా నగర్‌లో నివసిస్తోంది. ఈమెకు నరేష్ అనే యువకుడితో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆపై ఇద్దరూ కలసి ఒకే గదిలో సహజీవనం చేశారు. పెళ్లిని దాటవేస్తూ వచ్చిన నరేష్, ఓ మారు అమెకు అబార్షన్ కూడా చేయించాడు.
 
ఈ క్రమంలో ఇటీవల నరేష్ ఫోన్‌లో ఓ యువతి ఫొటో ఆమెకు కనిపించింది. ఎవరని నిలదీయగా, తన సోదరి అని అబద్ధమాడాడు. అనుమానం వీడక ఆమె ఆరాతీసింది. ఇందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 30వ తేదీ, గురువారం రోజున వారిద్దరికీ కరీంనగర్‌లో వివాహం జరగనుందని తెలిసింది. 
 
అంతే... ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తక్షణం ఎక్స్‌ప్రెస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పెళ్లి జరిగే కల్యాణ మండపానికి వెళ్లారు. పెళ్లిని నిలిపివేయించి, నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.