శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (10:45 IST)

యువతితో ముళ్లపొదల్లో మజా.. ఆటో డ్రైవర్ గొంతుకోసిన దుండగులు

అనంతపురంలో వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. ఓ యువతితో వివాహితుడు కొనసాగిస్తున్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమైంది. అనంతపురం జిల్లా రేగాటిపల్లే రైల్వే గేట్‌కు చెందిన బాబావలీ (22) అనే ఆటో డ్రైవర్ స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు వివాహమై భార్య ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో తనకు బంధువు అయిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం యువతి పెద్దలకు తెలియడంతో హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ.. బాబావలీ తీరుమారలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం రేల్వే గేట్ సమీపంలోని ముళ్లపొదల్లో వీరిద్దరు కలిసివుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బాబావలిపై దాడి చేసి గొంతుకోసి హత్యచేసి పారిపోయారు. హత్యా స్థలిని పరిశీలించిన టౌన్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.