ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:36 IST)

రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా? .. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో శ‌నివారం ఉద‌యం ప‌లువురు బీజేపీ నేతలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మూడు అంశాలపై గవర్నర్‌కి వారు వినతి పత్రం అందజేశారు.

అనంత‌రం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశార‌ని, అస‌లు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంద‌న్నారు. గ్రామ సచివాలయం, వార్డ్ వాలంటీర్ల పరీక్షలు కూడా అపహాస్యం చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయలేద‌ని, ఇస్తానుసారంగా నియామకాలు చేశార‌న్నారు.

ఇసుక అందుబాటులో లేక‌పోవ‌డం, భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం వలన కార్మికులు రోడ్డున పడ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సెప్టెంబర్ 5 దాకా ముహూర్తం పెట్టార‌ని అది దాటినా కూడా ఇసుక అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రజల కడుపులు మాడుతున్నాయని లేఖ రాసిన పట్టించుకోలేద‌న్నారు. ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు అన్నారు.

సీఎం చేతలు, మాటలకు పొంతన లేద‌న్నారు. ఇసుక బ్లాక్‌లో దొరుకుతుంది తప్ప ప్రజలకు అందడం లెద‌న్నారు. దేవాలయ భూములు విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ డిమాండ్ చేశారు.

2017లో అసిస్టెంట్  ప్రొఫెసర్లు పోస్టులు నిలిచిపోయాయని వారికి పోస్ట్‌లు ఇవ్వాలని గవర్నర్‌కి తెలియజేసిన‌ట్లు చెప్పారు. స‌మస్యల పరిష్కారం కోసం అవసరమైతే విజయవాడలో ధర్నా చేస్తాం అని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు.

ప్రభుత్వంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై గ‌వ‌ర్న‌ర్‌కి వినతిపత్రం అందించామ‌న్నారు. ప్రభుత్వం ఇస్తామన్న మెరిట్ ఆధారిత ఉద్యోగాలిస్తామని అపహాస్య పరిస్ధితి తెచ్చింద‌ని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ల రిజర్వేషన్ అమలు జరగలేదు అన్నారు.

భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోయార‌ని తెలిపారు. లక్షల మంది ఆకలి చావుల పాలవుతున్నార‌ని, ఇంకా ఇసుక అందుబాటులోకి రాలేద‌న్నారు. దేవాలయ భూములను సొంత భూముల్లా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం ఆయా అంశాలపై వెంట‌నే స్పందించ‌క‌పోతే  ధర్నాకు దిగుతాం అని హెచ్చ‌రించారు.