శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PYR
Last Modified: సోమవారం, 26 జనవరి 2015 (09:55 IST)

ఆంధ్రుడిగా పుట్టడమే గొప్పతనం... అది వారి పూర్వజన సుకృతం: గవర్నర్

మహామహులకు ఆంధ్రప్రదేశ్ పురిటి గడ్డ. ఈ గడ్డపై పుట్టడం వారి పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం ఉదయం విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. వేడుకల్లో గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ జెండాను తయారు చేసిన పింగళ వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వాడు కావడం విశేషం అన్నారు. 
 
తన ప్రభుత్వం స్మార్టు విలేజ్, స్మార్టు వార్డ్, స్మార్టు ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగుతోందని అన్నారు. మార్చి 31 లోపు ఈ గవర్నెన్స్ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి జపాన్ హామీ ఇచ్చిందని రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.