శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 ఆగస్టు 2014 (16:54 IST)

జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం తీసుకోండి నాయనలారా...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపి) అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మెగా ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు  తన వద్ద లక్ష కోట్లు ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని ఆఫర్ చేశారు. పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.