శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (12:24 IST)

నా మనిషిని టీటీడీలో ఏజెంటుగా నియమించండి: ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమార్తి సిఫార్సు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు బాగా కావాల్సిన వ్యక్తికి చోటు కల్పించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి రాసిన సిఫార్సు లేఖ ఇపుడు టీటీడీలో కలకలం రేపుతోంది. ఈ లేఖపై ఎలా స్పందించాలో తెలియకు తితిదే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
 
టీటీడీలో సామాన్య భక్తులకు సేవలందించే ఏజెంటుగా తన మనిషి నందకుమార్‌కు అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు లేఖ రాశారు. ఏజెంట్ల నియామకం కోసం ఏకంగా మంత్రులు సిఫారసు లేఖలు పంపుతుండటంపై అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మంత్రుల స్థాయి నుంచి సిఫారసులు వెల్లువెత్తితే పని చేయడమెలాగంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు.. పదేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తితిదేకి వచ్చే సిఫార్సు లేఖల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీఐపీ దర్శనాల కోసం ప్రజా ప్రతినిధులు చేస్తున్న సిఫారసులను అమలు చేయలేక టీటీడీ అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ కోవలోనే తాజాగా ఏపీ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన సిఫారసు లేఖ కూడా టీటీడీలో కలకలం రేపుతోంది.