1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (16:53 IST)

హల్లో జగన్... స్వల్పకాలిక చర్చ అంటే ఏంటో తెలుసా? : ప్రశ్నించిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి సభాపతి కోడెల శివప్రసాద్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో జగన్ ఖంగుతిన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చ చేపట్టారు.
 
ఆ సమయంలో పట్టిసీమ, పోలవరం అంశాలపై మాట్లాడేందుకు జగన్ ప్రయత్నించారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో స్పీకర్, జగన్ మైకును కట్ చేయడంతో వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. 
 
ఇది స్పీకర్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటన్.. జగన్‌నుద్దేశించి.. స్పల్పకాలిక చర్చ అంటే ఏమిటో మీకు తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. చర్చించాల్సిన విషయాన్ని వదిలేసి, ఇతర విషయాల జోలికి వెళ్తుంటే... నిర్ణీత సమయంలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇలా చేస్తే, మీరే నష్టపోతారని హెచ్చరించారు.