శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (09:22 IST)

వైకాపాను వీడటం నరకం నుంచి బయటపడినట్టుగావుంది : కొణతాల

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ నుంచి బయటకు రావడం ఏదో ఒక నరకం నుంచి బయటపడినట్టుగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైకాపాకు, ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ఇటీవల రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 
 
తన రాజీనామా లేఖపై ఆయన తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ... వైసీపీ నుంచి బయటకు రావడంతో తనకు నరకం నుంచి విముక్తి లభించినట్లయిందన్నారు. 'వైసీపీని చేజేతులా నాశనం చేసుకుంటున్న జగన్ ప్రవర్తన చూస్తుంటే నాకు ఆయనపై జాలి, దయ కలుగుతున్నాయి. నా రాజీనామాను వెంటనే ఆమోదించి, నాలుగేళ్ల నుంచి నేను అనుభవిస్తున్న నరకం నుంచి జగన్ నాకు విముక్తి కలిగించారు. దీనికి, ఆయనకు ధన్యవాదాలు చెప్పకతప్పదు' అని వ్యాఖ్యానించారు.