శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (16:54 IST)

లెక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్ దాడి...! ప్రేమించి మోసం చేశాడని..!

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన లక్చరర్‌పై విద్యార్థిని యాసిడ్ చేసిన సంఘటన గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను ఆస్పత్రికి చికిత్స పొందుతున్నాడు. 
 
తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. కాగా లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.