శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (23:05 IST)

విజయవాడలో బల్లి బిర్యాని.. బాబోయ్

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వె

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ ఇద్దరూ వికారంతో వాంతులు చేసుకున్నారు. 
 
అస్వస్థతకు గురయిన ఇద్దరిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్లి బిర్యానీ వడ్డించిన హోటల్‌పై ఇతర వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు వచ్చేలోపే హోటల్ సిబ్బంది బిర్యానీ మొత్తాన్ని బయటపారేశారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌కు వచ్చి వంటకాలు జరుపుతున్న గదులను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు అధికారుల గుర్తించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు.