శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 అక్టోబరు 2018 (22:34 IST)

తిత్లీ తుఫాన్ స‌హాయ నిధికి దర్శకుల సంఘం ల‌క్ష రూపాయ‌ల విరాళం

ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెల్సిందే. ఇలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చిత్ర పరిశ్రమ నుండి తక్షణ స్పందన వస్తుందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ విపత్తు పై స్పందించిన కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించటం జరిగింది.
 
ఈ నేపథ్యంలో మా “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం” కూడా స్పందిస్తూ తిత్లీ తుఫాను సహాయ నిధికి రూ. 1,00,000 (లక్ష రూపాయల) విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుగు చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ తెలియ‌చేసారు. 
 
అసోసియేషన్ సభ్యులు కొందరు వ్యక్తిగత హోదాలో కూడా విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన మీదట అవి కూడా వసూలు చేసి ఒకే మొత్తంగా తుఫాను బాధితుల సహాయనిధికి అంద‌చేస్తాం అన్నారు.