గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (13:17 IST)

నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ : 'మహర్షి' కలెక్షన్ల వర్షం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 25వ చిత్రం "మహర్షి". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో పాటు వేసవి సీజన్ కావడంతో బాగా కలిసివచ్చింది. ఫలితంగా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్ చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 
ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.24.6 కోట్ల మేరకు వసూలు చేయగా, రెండో రోజు మాత్రం కాస్త తగ్గింది. కానీ వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫలితంగా కేవలం 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. 
 
ఇకపోతే, విదేశాల్లో ఒక మిలియన్ మార్కును దాటేసింది. ఓవర్సీస్‌లో ఒక్క మిలియన్ సాధించిన మహేష్ సినిమాల్లో మహర్షి 9వ సినిమా కావడం విశేషం. ఇప్పటికి 1.5 మిలియన్స్ క్రాస్ చేసి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉంది. వ్యవసాయం చేసే రైతు గొప్పతనాన్ని, పంట పండించే వాడి అవసరాన్ని చక్కటి సందేశం ద్వారా చెప్పడంతో మహర్షికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 
 
ఈ చిత్రం కథ ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు.. వేసవి సెలవులు దీనికితోడు ప్రతి ఒక్కరూ చూసేవిధంగా ఈ చిత్రం ఉండటంతో సినీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, వచ్చే శుక్రవారం వరకు మరో కొత్త చిత్రం విడుదల లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసివచ్చింది.