మతిభ్రమించి... మహిళను నరికి చంపాడు..
ఆమె పాటికి ఆమె ఇంట్లో పిండి రుబ్బుకుంటోంది. అయితే వెనుక నుంచి ఓ ఆగంతుకుడు గొడ్డలితో నరికి చంపాడు. మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
చీరాల పట్టణం వడ్డే నాగేశ్వరరావు బజారుకు చెందిన మల్లిక అనే మహిళ తన ఇంట్లో పిండి రుబ్బుకుంటోంది. ఆ సమయంలో వెంకటేశ్వరులు అనే వ్యక్తి లోనికి చొరబడ్డాడు. వెనుక నుంచి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో మల్లిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.