1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (13:25 IST)

రాజయ్యను కేసీఆర్ గొంతు కోశారు : మందకృష్ణ మాదిగ

తెలంగాణలో దళితులను సీఎం చేస్తానని హామీ ఇచ్చి... కేసీఆర్ మోసం చేశారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజయ్యను అకారణంగా గొంతు కోశారని ఆయన ఆరోపించారు. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు
 
తెలంగాణ మాదిగలను కేసీఆర్‌ టార్గెట్‌ చేశారని మందకృష్ణ ఆరోపించారు. అవినీతి, స్వైన్‌ఫ్లూలను సాకుగా చూపించి రాజయ్యను బర్తరఫ్‌ చేశారని ఆయన దుయ్యబట్టారు. కడియం శ్రీహరికి డిప్యూటీ సి.ఎం. ఇవ్వడాన్ని మేం స్వాగతిస్తున్నామని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. 
 
అయితే కడియం సి.ఎం. పదవికి అర్హుడన్నారు. కొడుకు, కూతురు చేసే అవినీతి ఆయనకు కనిపించదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించిన కేసీఆర్‌ రాజయ్యకు డిప్యూటీ సి.ఎం. ఇవ్వటం కూడా ఇష్టం లేదన్నారు.