1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:42 IST)

బాలిక శీలాన్ని అనుభవించాడు.. గర్భానికి రూ.లక్ష వెలకట్టాడు!

మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. 17 బాలికను 16 యేళ్ల వయస్సున్న బాలుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇది బయటకు పొక్కడంతో పంచాయతీ పెట్టి.. గర్భానికి లక్ష రూపాయలు వెలకట్టాడు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పడి బహిర్గతం కావడంతో పోలీసులు స్పందించి, బాలికపై అత్యాచారం చేసిన బాలుడితో పాటు.. గర్భానికి వెల కట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే మెదక్ జాల్లా గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల శివాజీ (16) కుటుంబీకులకు చెందిన పొలంలోకి అదే గ్రామానికి చెందిన బాలిక (17) చిక్కుకుడు కాయల కోతకు వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలికపై కన్నేసిన శివాజీ.. తన మాయమాటలతో ఆ బాలికను లోబర్చుకుని ఆ తోటలోనే అనుభవించాడు. 
 
ఆ తర్వాత నెల తిరిగే సమయానికి బాలికను గర్భవతి అయింది. ఈ విషయం బాలిక శివాజీతో చెప్పడంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు లక్ష రూపాయలు ఇస్తాం.. గర్భం తీసేయించుకోమని సలహా ఇచ్చాడు. దీనికి ఆ బాలిక ససేమిరా అంది. 
 
ఆ తర్వాత బాలిక ఫిబ్రవరి 23న పంచాయతీ పెట్టించింది. 24న బాలిక శీలానికి లక్ష రూపాయలు ఖరీదు కట్టి అబార్షన్ చేయించుకోవాలని తీర్పునిచ్చారు. పిమ్మట శివాజీ సోదరుడు రాజు, బావ మేస్త్రీ శ్రీను, సోదరి రాణెమ్మలు గజ్వేల్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. 
 
అయితే, ఈ విషయం వెలుగు చూడటంతో తోగుంట పోలీసులు రంగంలోకి దిగి.. శివాజీ, రాజు, శ్రీను, రాణెమ్మ, డాక్టర్ సాంబశివరావులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.