మెదక్ను మూడు జిల్లాలుగా విభజిస్తాం: కేసీఆర్ ప్రకటన
మెదక్ను మూడు జిల్లాలుగా విభజించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి మిగతా ప్రాంతాలకు చాలా దూరం ఉన్నందున మెదక్ను మూడు జిల్లాలుగా విభజించనున్నట్టు ప్రకటించారు.
ఇప్పుడున్న మెదక్ జిల్లా అలాగే ఉంటుందని మెదక్ హెడ్క్వార్టర్గా జిల్లాగా కొనసాగుతుందన్నారు. సంగారెడ్డి, సిద్దిపేటను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తామన్నారు.
మెదక్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ మెదక్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పాలనను వికేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు. పాలన దృష్ట్యా సిద్దిపేటను కూడా జిల్లాగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.