బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (16:07 IST)

ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా.. హోటల్ ఖర్చులు భరిస్తానంటున్న ఐటీ మంత్రి

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్చులు భరిస్తానని చెప్పారు. 
 
విశాఖపట్టణంలో ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ పాలసీ నిబంధనల ప్రకారమే భూములిస్తున్నామన్నారు. 
 
ప్రతిపక్షాలు ఐటీ కంపెనీని రాష్ట్రానికి తీసుకొస్తే 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. 21 రోజుల్లో కంపెనీలకు భూములివ్వాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన సూచనల మేరకు కంపెనీలకు అన్ని అనుమతులిస్తామని తెలిపారు. లోకేష్ సవాల్‌ను సమర్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యే బల్లలు చరిచి తమ మద్దతును తెలిపారు.