1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (16:44 IST)

చిత్తూరు కాశిపెంట్లలో ఎన్‌టిఆర్‌ ఉచిత ఆరోగ్యసేవా కేంద్రాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

తిరుపతి సమీపంలోని కాశిపెంట్ల గ్రామంలో ఎన్‌టిఆర్‌ ఉచిత ఆరోగ్య సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కావడంతో ఈ కేంద్రాన్ని ఎన్‌టిఆర్‌ ట్రస్టు కింద ఏర్పాటు చేశారు. నారావారిపల్లి, కాశిపెంట్లతో పాటు చుట్టుప్రక్కలలోని 15 గ్రామాల ప్రజలకు చికిత్సను ఈ ఎన్‌టిఆర్‌ సేవా కేంద్రంలో అందించనున్నారు. అలాగే సేవా కేంద్రం ఆవరణలో నారా భువనేశ్వరి చెట్లను కూడా నాటారు.
 
మొదటిరోజే ఆరోగ్య సేవా కేంద్రానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్‌టిఆర్‌ సేవా చికిత్సా కేంద్రంలో నిరుపేదలకు ఉచిత చికిత్సను అందించనున్నారు.