శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 జూన్ 2018 (09:50 IST)

గోదావరి మధ్యలో ప్రధాని ఫోటోనా? చాలా బాగోదా... బాగుంటుందా?

కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడ

కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్ గారు చేస్తున్న దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతుంది.
 
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీ లో యాత్రలు చేస్తే బాగుంటుంది'' అని ట్వీట్ చేశారు. 
 
ఐతే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు చేసిన ట్వీట్ ను ఆయన ఉటంకించారు. అందులో ఏమున్నదంటే... " పోలవరం పనులు జరిగే చోట ప్రధాని ఫోటో పెట్టాలి: వీర్రాజు.సోము, గోదావరి మధ్యలో అయితే బాగుంటుందేమో, ఫొటోకు దండ వేసి దండం పెట్టుకోవచ్చు!'' అని. అదీ సంగతి.