శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (09:45 IST)

లక్ష్మీపార్వతి హెచ్చరికతో ప్రాణభయం ఏర్పడింది.. శివాజీ

ఆపరేషన్ గరుడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన హీరో శివాజీ. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ.. ఆపరేషన్ గరుడ విషయంలో మాత్రం సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా ఆపరేషన్‌ గరుడ పేరుతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటున్నారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు.
 
ఇప్పటికే అగంతకుల నుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సైతం సోషల్‌ మీడియాలో తనను హెచ్చరించారని లేఖలో శివాజీ పేర్కొన్నారు.
 
నవంబర్‌ 21వ తేదీన అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాను వస్తున్నానని.. ఆ సమయంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శివాజీ రాసిన లేఖలో పేర్కొన్నారు.